శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2017 (14:42 IST)

జూలై ఒకటి నుంచి జీఎస్టీ విధానం... పన్నుపోటు లేని వస్తువులేవి?

ఒకే దేశం.. ఒకే పన్ను విధానం జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ వస్తు సేవల పన్ను విధానం వల్ల చాలా మేరకు గృహావసర వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే, రోజువారీ వినియోగించే నిత్యావసర

ఒకే దేశం.. ఒకే పన్ను విధానం జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ వస్తు సేవల పన్ను విధానం వల్ల చాలా మేరకు గృహావసర వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే, రోజువారీ వినియోగించే నిత్యావసరాలు, వివిధ రకాల ఉత్పత్తులపై ఎంత పన్ను చెల్లించాల్సి వుంటుందో ఓసారి పరిశీలిస్తే...
 
తాజా కూరగాయలు, గోధుమలు, మైదా, శెనగపిండి, పెరుగు, మజ్జిగ, లస్సీ, తేనె, ఉప్పు, తిలకం, కాటుక, పాలపొడి, టీ, కాఫీ, మసాలాలు, కిస్మిస్, జీడిపప్పు, ఔషధాలు, చక్కెర, బొగ్గు,. వైద్య సేవలు, ముద్రించిన పుస్తకాలు, వార్తా పత్రికలు, గాజులు, చేనేత వస్త్రాలు, గుడ్లు, అగర్ బత్తీలు, వంట నూనెలు, పాదరక్షలు (రూ. 500 లోపు) వంటి వాటిపై పన్ను పోటు లేదు. 
 
అలాగే, 12 శాతం పన్ను పోటు పరిధిలోకి ఆయుర్వేద మందులు, పళ్లపొడి, వెన్న, కార్న్ ఫ్లేక్స్, సాస్, సూప్‌లు, ఇన్‌స్టంట్‌ఫుడ్, ఐస్‌క్రీమ్, హెల్మెట్లు, కుట్టుమిషన్లు, సెల్‌ఫోన్లు (లోఎండ్), పాల డబ్బాలు, రుమాళ్లు, నోటుపుస్తకాలు, స్టీల్ ప్రొడక్టులు, కెమెరాలు, స్పీకర్లు, ఎలక్ట్రానిక్ బొమ్మలు, టిష్యూలు, మానిటర్లు తదితరాలను చేర్చారు.