NEET UG 2025: తెలుగు రాష్ట్రాల నుంచి ఆకాశ్ విద్యా సంస్థకి చెందిన నలుగురు విద్యార్థులకి టాప్ ర్యాంకులు
విజయవాడ: తెలుగు రాష్ట్రాల నుండి నలుగురు విద్యార్థులు NEET UG 2025 పరీక్షలో అద్భుత విజయాన్ని సాధించి, దేశవ్యాప్తంగా టాప్ స్కోరర్లలో చోటు దక్కించుకున్నారని దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన పరీక్షల ప్రిపరేషన్ సంస్థగా గుర్తింపు పొందిన ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ గర్వంగా ప్రకటించింది. ఈ విజయాలు విద్యార్థుల క్రమశిక్షణ, అకడమిక్ నిబద్ధత, AESL అందించిన ప్రపంచ స్థాయి శిక్షణ, మార్గదర్శకత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా విడుదల చేసింది.
తెలుగు రాష్ట్రాల టాప్ పర్ఫార్మర్లుగా నిలిచిన విద్యార్థుల్లో:
కె. నిఖిల్ సాయి - AIR 297
కునాల్ ఎం- AIR 479
రుత్విక్ జోషి- AIR 557
తేజేశ్వర్ కృష్ణమూర్తి- AIR 620
ఈ విద్యార్థుల విజయాలు వారిలో ఉన్న దీర్ఘకాలిక లక్ష్య సాధన తపనతోపాటు AESL సంస్థలో పొందిన నిర్మితమైన విద్యాపునాదులను ప్రతిబింబిస్తాయి.
ఈ విద్యార్థులు AESL యొక్క క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో భాగంగా NEET పరీక్షకు సిద్ధమయ్యారు. ఈ ప్రోగ్రామ్ NEET లాంటి అత్యంత పోటీ పరీక్షలను ఎదుర్కొనే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. విజయాన్ని గూర్చి వారు ఇలా తెలిపారు: “ఈ ప్రయాణమంతా మాకు మార్గనిర్దేశనం చేసిన ఆకాశ్కు మనస్పూర్తిగా కృతజ్ఞతలు. సుదీర్ఘ సిలబస్ను సమయపాలనతో నేర్చుకునేలా చేసింది. స్ట్రక్చర్డ్ కంటెంట్, నిపుణుల బోధన మరియు వ్యక్తిగత మెంటరింగ్ వల్లే మేము క్లిష్టమైన కాన్సెప్ట్స్ను పూర్తిగా గ్రహించగలిగాము. AESL లేకుండా ఇది సాధ్యపడేది కాదు,” అని విద్యార్థులు అన్నారు.
AESL ప్రధాన అకడమిక్- బిజినెస్ హెడ్ శ్రీ ధీరజ్ కుమార్ మిశ్రా అభినందనలు తెలుపుతూ అన్నారు, "NEET UG 2025లో మా విద్యార్థులు చూపిన అద్భుత ప్రదర్శనపై మేము ఎంతో గర్విస్తున్నాం. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది పాల్గొనే ఈ పరీక్షలో ఇంత గొప్ప స్కోర్ సాధించడం చిన్న విషయం కాదు. ఇది విద్యార్థుల కృషి, వారి తల్లిదండ్రుల మద్దతు, మా బోధన బృందం సమర్పణకు నిదర్శనం. వారి వైద్య విద్యా మార్గంలో మరింత విజయాలు కోరుకుంటున్నాం.”
NEET UG పరీక్షను ప్రతి సంవత్సరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. ఇది భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో MBBS, BDS, మరియు AYUSH (BAMS, BUMS, BHMS) కోర్సులకు ప్రవేశానికి అర్హత పరీక్షగా ఉంటుంది. అలాగే విదేశాల్లో ప్రాథమిక వైద్య విద్యను అభ్యసించదలచిన విద్యార్థులకూ ఇది అవసరం.