1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2019 (15:07 IST)

టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఓపెన్ స్కూల్ ఎస్ఎస్‌సి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు 60 కేంద్రాలలో, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు 47 కేంద్రాలలో, ప్రాక్టికల్స్ పరీక్షలు 17 కేంద్రాలలో నిర్వహించినట్లు చెప్పారు. 
 
పదో తరగతి పరీక్షలకు 14,676 మంది విద్యార్థులు హాజరు కాగా, అందులో 9,382 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. 63.9 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. అలాగే ఇంటర్మీడియట్‌లో 14,077 మంది విద్యార్థులు హాజరు కాగా అందులో 7,478 మంది ఉత్తీర్ణులయినట్లు మంత్రి సురేష్ తెలిపారు. 53.12శాతం ఉత్తీర్ణత నమోదయినట్లు చెప్పారు. 
 
పదవ తరగతి ఫలితాలలో గుంటూరు జిల్లా 88 శాతం ఉత్తీర్ణత సాధించగా, చివరి స్థానంలో కడప ఉందన్నారు. ఇంటర్మీడియట్‌లో ప్రకాశం జిల్లా 71.96 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, పశ్చిమ గోదావరి 33.49 శాతంతో చివరి స్థానంలో నిలిచిందన్నారు. 
 
www.apopenschool.org వెబ్‌సైట్‌లో‌ వివరాలను ఉంచినట్లు మంత్రి పేర్కొన్నారు. జవాబు పత్రాల పునఃపరీశీలన, డూప్లికేట్ సర్టిపికేట్‌ను పొందే సదుపాయం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ కమిటీ కల్పిస్తుందన్నారు. వీటికి నిర్ణీత రుసుం ద్వారా ఏపీ అన్‌లైన్ ద్వారా పొందవచ్చునని చెప్పారు. 9.8.2019 నుంచి 20.08.19 వరకు ఫీజ్ చెల్లింపులకు చివరి తేదీగా నిర్ణియంచినట్లు మంత్రి సురేష్ తెలిపారు.