1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 మే 2020 (08:06 IST)

హైదరాబాద్‌లో కరోనా డేంజర్ బెల్స్ .. అంతకంతకూ...

హైదరాబాద్ మహానగరంలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో భాగ్యనగరి వాసులతో పాటు అధికారులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. 
 
ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1813కు చేరుకున్నాయి. కొత్తగా నమోదైన 52 కేసుల్లో 33 కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదుకావడం గమనార్హం. వీరిలో 19 మంది వలస కూలీలు ఉన్నారు. అలాగే, ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతుల సంఖ్య 49కు చేరింది. 
 
ఇకపోతే, వివిధ ఆస్పత్రుల నుంచి 25 మంది కరోనా రోగులు డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1068కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 696 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.