బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By శ్రీ
Last Modified: శనివారం, 1 ఆగస్టు 2020 (18:09 IST)

కరోనాను జయించి తిరిగి వస్తానని కోవిడ్ కాటుతో కన్నుమూసిన మాజీ మంత్రి

భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో మాజీ మంత్రిగా సేవలు అందించిన పైడి కొండల మాణిక్యాలరావు (60) మృతి చెందారు. గత నెల రోజుల కిందట ఆయకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు.
 
నాకు కరోనా వచ్చింది అయినా ఎంతో ధైర్యంగా ఉన్నా. కరోనాను జయించి ఆరోగ్యవంతంగా తిరిగి వస్తానని గత కొన్ని రోజులు క్రితం వీడియో కూడా పంపిచారు. ఇంతలోనే ఇలా జరగడం అత్యంత బాధాకరం కని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిత్రులు, అభిమానులు, పార్టీ వర్గాలు. సుదీర్ఘ కాలంగా ఆర్.ఎస్.ఎస్‌తో పనిచేసిన మాణిక్యాలరావుకు సౌమ్యుడుగా మంచి పేరుంది.
 
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరుపున విజయం సాధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు మాణిక్యాలరావు.
 
1989 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీలో చేరిన ఆయన పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన హయాంలో జీర్ణావస్థలో ఉన్న ఎన్నో దేవాలయాలను పునరుద్ధరించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని తాడేపల్లిగూడెంకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు.