శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 6 నవంబరు 2018 (08:56 IST)

అజారుద్ధీన్‌పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు.. బెల్‌ను మోగించడం ఏంటి?

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాజీ సారథి, భారత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన మహ్మద్ అజారుద్దీన్‌పై గంభీర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈడెన్ గార్డెన్స్‌లోని బెల్‌ను మోగించడమేంటని మండిపడ్డాడు. ఆదివారం భారత్-విండీస్ మధ్య  జరిగిన తొలి ట్వంటీ-20కి ముందు అజారుద్ధీన్ గంట మోగించి మ్యాచ్‌ను ప్రారంభించడం ఏమిటని గంభీర్ తీవ్రంగా తప్పుబట్టాడు. 
 
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలిచినా.. బీసీసీఐ, సీవోఏ, సీఏబీ మాత్రం ఓడిపోయాయని.. అవినీతి వ్యతిరేక పాలసీకి ఆదివారం మంగళం పాడారని గంభీర్ తెలిపాడు. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ పడే అవకాశం అతడికి (అజార్) ఇచ్చారని తెలుసు. 
 
కానీ బెల్ మోగించే అవకాశం కూడా ఇవ్వడం తనను షాక్‌కు గురిచేసిందని గంభీర్ ట్వీట్ చేశాడు. గంభీర్ ట్వీట్‌ను కొందరు ప్రశంసిస్తుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అజార్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.