భవిష్యత్తులో సంగాకు అంతా మంచే జరగాలి: బీసీసీఐ ప్రశంసల జల్లు
భారత్తో జరిగిన కొలంబో టెస్టుతో క్రికెట్కు బైబై చెప్పేసిన శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరకు భవిష్యత్తులో మంచే జరగాలని బీసీసీఐ ఆకాంక్షించింది. కొలంబొ టెస్టులో గురువారం మ్యాచ్ ప్రారంభానికి ముందు సంగక్కరను బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ.. సంగక్కరపై ప్రశంసల జల్లు కురిపించాడు.
సంగక్కర కేవలం శ్రీలంక క్రికెట్ ఆస్తి మాత్రమే కాదని, క్రికెట్ క్రీడకు గొప్ప ప్రతినిధి అని కొనియాడారు. సంగక్కర నిజంగానే దిగ్గజ ఆటగాడని, వెలుపల అతడి వ్యక్తిత్వం ఉన్నతమైందని కితాబిచ్చాడు. బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా కూడా సంగాకు శుభాకాంక్షలు తెలిపారు.