1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 మే 2016 (17:57 IST)

కోహ్లీని కిడ్నాప్ చేశారా? నిజమేనా? డిషూమ్ సంగతేనా?

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ కిడ్నాప్ గురించి ముంబైలో జోరుగా ప్రచారం సాగుతోంది. అతడిని కిడ్నాప్ చేశారని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. విరాట్ కోహ్లీ మనస్తత్వంపై బాలీవుడ్‌లో డిషూమ్ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో కోహ్లీని పోలి వున్న క్రికెటర్ పాత్రలో సకీబ్ సలీమ్ నటిస్తున్నాడు. మరో ప్రధాన పాత్రలో జాన్ అబ్రహాం నటిస్తున్నాడు. 
 
ఈ సినిమాలో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి ఆకట్టుకునే.. జట్టుకు విజయాన్ని సమకూర్చగలిగే క్రికెటర్‌గా సకీబ్ కనబడుతున్నాడని తెలిసింది. ఈ సినిమాను సాజిద్‌ నడియవాలా నిర్మాణంలో డేవిడ్‌ ధావన్‌ తెరకెక్కిస్తున్నాడు. 
 
అధికారికంగా చెప్పకపోయినా అది కోహ్లీ స్ఫూర్తిగా తెరకెక్కుతుందని చెప్పాలి. సకీబ్ కూడా కోహ్లీని పోలిన పాత్రలో మెప్పిస్తాడని తెలుస్తోంది. ఇక, తాజా విషయమేమిటంటే ఈ సినిమాలో విరాట్‌ పాత్రధారి సకీబ్‌ కిడ్నాప్‌నకు గురవుతాడట. జాన్‌ అబ్రహం అతణ్ని కిడ్నాప్‌ చేస్తాడట. ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌ అయింది.