ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: భారత్కు నాలుగో స్థానం, కోహ్లీకి పదో ర్యాంకు
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు క్రికెట్కు సంబంధించి తాజా ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. టీమ్ విభాగంలో భారత జట్టు తన నాలుగో స్థానాన్ని సంపాదించుకుంది.
ఇంగ్లండ్ ఐదో స్థానంలో ఉండగా, పాకిస్థాన్ ఆ తర్వాతి స్థానాన్ని సంపాదించుకుంది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా టాప్ చెయిర్లో ఉండగా, రెండు, మూడు స్థానాల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు నిలిచాయి.
ప్రస్తుతం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య యాషెస్ సిరీస్ జరుగనుండటంతో ర్యాంకుల్లో మార్పులు చోటుచేసుకునే ఛాన్సుంది. ఇంగ్లండ్ గనుక సిరీస్ను 3-0తో నెగ్గితే రెండో ర్యాంకుకు చేరుకుంటుంది. అయితే, ఆసీస్ గనుక సిరీస్లోని 5 మ్యాచ్లలోనూ నెగ్గితే మాత్రం ఇంగ్లాండ్ ఏడో స్థానానికి పడిపోతుంది. ఇక, బ్యాటింగ్ జాబితా విషయానికొస్తే... విరాట్ కోహ్లీ ఒక్కడే భారత్ తరపున టాప్ -10లో ఉన్నాడు. కోహ్లీకి పదో ర్యాంకు సొంతమైంది.