అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన పియూష్ చావ్లా!!
భారత క్రికెటర్ పియూష్ చావ్లా అన్ని క్రికెట్ ఫార్మెట్ల నుంచి వీడ్కోలు పలికారు. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మెట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు.
"రెండు దశాబ్దాలకు పైగా మైదానంలో గడిపిన తర్వాత ఈ అద్భుత ఆటకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చింది. భారత జట్టుకు అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం నుంచి 2007 టీ వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్లలో ఒక సభ్యుడుగా ఉండటం వరకు ఈ ప్రయాణంలోని ప్రతిక్షణం దేవుడు ఆశీర్వాదమే. ఈ జ్ఞాపకాలు నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి" అని చావ్లా తన పోస్టులో పేర్కొన్నారు.
కాగా, భారత్ తరపున పియూష్ చావ్లా 2006 నుంచి 2012 మధ్యకాలంలో మూడు టెస్టులు, 25 వన్డేలు, 7టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అన్ని ఫార్మెట్లలో కలిపి మొత్తం 43 వికెట్లు పడగొట్టారు. అలాగే, ఐపీఎల్ పోటీల్లో పంజాబ్, కోల్కతా, ముంబై ఇండియన్స్ జట్ల తరపున ఆడాడు.