1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2017 (06:26 IST)

పరువు పోగొట్టుకున్న శ్రీలంక... భారత్ క్లీన్ స్వీప్

సొంతగడ్డపై శ్రీలంక పరువు పోయింది. భారత్‌తో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్‌లలో ఏ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేక పోయింది. ఫలితంగా టెస్ట్ సిరీస్‌ను 3-0 తేడాతోనూ, వన్డే సిరీస్‌ను 5-0తో భారత్‌కు అప్పగించింది.

సొంతగడ్డపై శ్రీలంక పరువు పోయింది. భారత్‌తో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్‌లలో ఏ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేక పోయింది. ఫలితంగా టెస్ట్ సిరీస్‌ను 3-0 తేడాతోనూ, వన్డే సిరీస్‌ను 5-0తో భారత్‌కు అప్పగించింది. 
 
ఆదివారం రాత్రి కొలంబో వేదికగా జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో లంకేయులపై సునాయాస విజయాన్ని నమోదు చేసారు. ఫలితంగా వ‌న్డే సిరీస్‌ను 5-0తో కైవ‌సం చేసుకుంది. శ్రీలంక‌పై ఐదు వ‌న్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయ‌డం ఇది రెండోసారి. గ‌తంలో 2014లోనూ భార‌త్ శ్రీలంక‌పై 5-0తో గెలిచింది. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 238 ప‌రుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత 239 రన్స్ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా.. కెప్టెన్ కోహ్లి సెంచ‌రీ, కేదార్ హాఫ్ సెంచ‌రీ సాయంతో సునాయాసంగా గెలిచారు. 
 
46.3 ఓవ‌ర్ల‌లోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేజ్ చేసింది. విరాట్‌, జాద‌వ్‌ నాలుగో వికెట్‌కు 109 ర‌న్స్‌ పార్ట్‌న‌ర్‌షిప్ నెల‌కొల్పారు. చేజింగ్‌లో ఓపెన‌ర్లు ర‌హానే, రోహిత్ వికెట్ల‌ను త్వ‌ర‌గానే కోల్పోయినా.. కెప్టెన్ విరాట్‌, మ‌నీష్ పాండే, కేదార్ జాద‌వ్ టీమ్‌ను గెలుపుబాట ప‌ట్టించారు.