శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 జులై 2015 (12:09 IST)

జెట్ సెట్ గో సంస్థలో పెట్టుబడి పెట్టిన యువరాజ్ సింగ్

క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకున్నాక యువరాజ్ క్రికెట్‌ను కొనసాగిస్తూనే.. ఆయన బిజినెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 'బ్యూటీ అండ్ వెల్ నెస్', 'ఎడ్యుకేషన్', 'లాజిస్టిక్స్' రంగాల్లో వ్యాపారాన్ని ప్రారంభించిన ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ కన్ను ఇప్పుడు ఆకాశంపై పడింది. ప్రైవేటు జెట్స్ అండ్ హెలికాప్టర్ సేవలందిస్తున్న 'జెట్ సెట్ గో' సంస్థలో ఆయన నిర్వహిస్తున్న 'యూ వుయ్ కెన్' సంస్థ పెట్టుబడులు పెట్టింది.
 
అయితే, యువరాజ్ ఎంత పెట్టుబడి పెట్టారన్న విషయాన్ని మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకొని వచ్చిన తరువాత, యువరాజ్ క్రికెట్‌ను కొనసాగిస్తూనే, ఆయన బిజినెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, జెట్ సెట్ గో సంస్థ హైఎండ్ కస్టమర్ల ప్రయాణ అవసరాలు తీరుస్తూ, వారికి ఆన్ లైన్‌లో ప్రైవేటు జెట్ విమానాలను అద్దెకిస్తోంది. ఈ విభాగంలో మంచి వ్యాపార వృద్ధిని అంచనా వేసిన మీదటే యువరాజ్ పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది.