మ్యాచ్ ఆడుతుండగా మైదానంలో మరో ఆటగాడు కన్నుమూత
క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా గుండెపోటుకుగురైన ఓ ఆటగాడు కన్నుమూశాడు. ఈ ఘటన నమీబియా రాజధాని విందోల్లో జరిగింది. విందోల్ మైదానంలో నమీబియా, ఆరెంజ్ ఫ్రీ స్టేట్ మధ్య వన్డే మ్యాచ్ జరుగుతున్న సమయంలో నమీబియా క్రికెటర్ రేమాండ్ వాన్ స్కూర్(25) మైదానంలో కుప్పకూలాడు.
ఈ విషయాన్ని గమనించిన తోటి ఆటగాళ్లు, మ్యాచ్ నిర్వాహకులు హుటాహుటిన రేమాండ్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు నమీబియా క్రికెట్ బోర్టు ప్రకటించింది. రేమాండ్ మృతికి ఆ దేశాధ్యక్షుడితో సహా, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటించింది.