గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 17 మార్చి 2019 (17:38 IST)

నా హృదయం ముక్కలైంది : రికీపాంటింగ్

న్యూజిలాండ్‌ దేశంలో క్రైస్ట్‌చర్చ్ మసీదుల్లో మారణహోమంపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ కోసం ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాంటింగ్.. మసీదులపై దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించాడు. ఈ మారణహోమాన్ని చూసి తన హృదయం ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
ఈ కాల్పులపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓ ఉన్మాది మారణకాండలో అసువులు బాసిన వారిని చూస్తే చాలా బాధగా ఉంది. ప్రాక్టీస్ కోసం బస్సులో బయల్దేరుతున్నప్పుడు కొంతమంది క్రికెటర్లు మొబైల్ ఫోన్లలో వీడియో క్లిప్పింగ్‌లను చూపించారు. వాటిని చూసేందుకు నేను ధైర్యం చేయలేకపోయా. ఈ ఘటనకు సంబంధించి ఉదయం నుంచి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయన్నారు.
 
ఇలాంటి ఘటనలు న్యూజిలాండ్, క్రైస్ట్‌చర్చ్‌కే పరిమితమవుతాయనుకోవడం లేదు ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లోనూ జరిగే అవకాశముంది. అందువల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా. అాగే, ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతిచేకూరాలని ఆ దేవాన్ని ప్రార్థిస్తున్నా అని చెప్పారు.