శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By మోహన్
Last Modified: బుధవారం, 17 ఏప్రియల్ 2019 (20:02 IST)

వరల్డ్ కప్ స్టాండ్ బై లిస్టులో పంత్... ఎవరికి దెబ్బ తగిలితే వాళ్ల ప్లేసులో...

ఇంగ్లండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. 15 మంది సభ్యులతో కూడిన బృందాన్ని సెలక్టర్లు ఎంపిక చేసారు. ఈ టీమ్‌లో అంబటి రాయుడు, అలాగే రిషబ్ పంత్ పేర్లు ఎంపిక చేయలేదు. అయితే వీరిని ఎంపిక చేయకపోవడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన తరుణంలో ఈ ఇద్ద‌రి ప్లేయ‌ర్ల‌ను వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం స్టాండ్‌బైగా ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. 
 
వీరితో పాటు పేస్ బౌల‌ర్ న‌వ్‌దీప్ సైనీ కూడా ఆ జాబితాలో ఉన్నాడు. మే 30వ తేదీన ప్రారంభమయ్యే ఈ మెగా ఈవెంట్ కోసం ముగ్గురు ప్లేయ‌ర్ల‌ను బ్యాక‌ప్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ ఎవ‌రైనా ప్లేయ‌ర్ గాయ‌ప‌డితే, వారి స్థానంలో ఈ ముగ్గురిలో ఒక‌రు వెళ్తార‌ని బీసీసీఐ అధికారి ఒక‌రు చెప్పారు.