డబుల్స్ ఫైనల్లోకి సానియా జోడీ: గ్రాండ్ స్లామ్ టైటిల్కు ఒక్క అడుగు దూరంలో..
ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ ఫైనల్లోకి తొలిసారిగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దూసుకెళ్లింది. మహిళల డబుల్స్లో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ నెగ్గేందుకు సానియా ఒక్క అడుగు దూరంలో నిలిచింది.
సెమీఫైనల్లో ప్రపంచ నెం.1 సానియా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ 6-1, 6-2తో వరుస సెట్లలో ఐదోసీడ్ రాక్వెల్ కోప్స్ జోన్స్-స్పియర్స్ (అమెరికా) ద్వయంపై విజయం సాధించి, ఫైనల్లోకి ప్రవేశించింది.
56 నిమిషాల్లోనే మ్యాచ్ను ముగించిన ఇండో-స్విస్ జంట.. టైటిల్ పోరులో రెండో సీడ్ మకరోవా-వెస్నినా (రష్యా) జోడీతో తలపడేందుకు సిద్ధమైంది. కాగా గ్రాండ్స్లామ్ మహిళల డబుల్స్లో సానియా ఫైనల్కు చేరడం కెరీర్లో ఇది రెండోసారి.
2011 ఫ్రెంచ్ ఓపెన్లో సానియా-వెస్నినా జోడీ రన్నరప్గా నిలిచింది. మిక్స్డ్లో సానియా 3 గ్రాండ్స్లామ్ టైటిళ్లు నెగ్గింది. భూపతితో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ (2009), ఫ్రెంచ్ ఓపెన్ (2012) ట్రోఫీలు నెగ్గింది. గతేడాది సోరెస్తో యూఎస్ ఓపెన్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.