శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 డిశెంబరు 2016 (14:11 IST)

విరాట్ కోహ్లీ మించిపోయాడు.. ఎవరా క్రికెటర్!

సమకాలీన క్రికెట్ లో భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక అరుదైన క్రికెటర్. భారత జట్టుకు లభించిన ఓ ఆణిముత్యం. జట్టుకు విజయాలు అందించడంతో పాటు పరుగుల దాహంతో చెలరేగిపోయే ఆటగాడు. రికార్డుల పరంగా విరాట్ ఇ

సమకాలీన క్రికెట్ లో భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక అరుదైన క్రికెటర్. భారత జట్టుకు లభించిన ఓ ఆణిముత్యం. జట్టుకు విజయాలు అందించడంతో పాటు పరుగుల దాహంతో చెలరేగిపోయే ఆటగాడు. రికార్డుల పరంగా విరాట్ ఇప్పటికే ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 
 
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ఒకే ఒక్క వారుసుడిగా మన్ననలు అందుకుంటున్నాడు కూడా. ఈ క్రమంలోనే విరాట్ అనే రికార్డులు సృష్టిస్తున్నాడు. అయితే గత రెండేళ్లలో స్వదేశంలో జరిగిన వన్డే సగటులో ఇప్పటివవరకూ విరాట్ ముందంజలో ఉండగా, ఆ రికార్డును ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సవరించాడు.
 
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్‌తో క్రికెట్ సిరీస్ ఆడుతోంది. వన్డే మ్యాచ్‌లో స్వదేశీ యావరేజ్‌పరంగా స్మిత్ ముందు వరుసలోకి వచ్చేశాడు. 2015-16 సీజన్ నుంచి చూస్తే 16 వన్డే ఆడుతున్న స్మిత్.. 4 సెంచరీలు. 5 హాఫ్ సెంచరీలు నమోదు చేసి వెయ్యికి పైగా పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో వన్డేలో స్మిత్ శతకం సాధించాడు. 
 
ఇక్కడ స్మిత్ యావరేజ్ 79.23 కాగా, స్ట్రైక్ రేట్ 95.37 గా ఉంది. ఇది స్వదేశంలో జరిగిన వన్డేల్లో అత్యధిక యావరేజ్‌గా నమోదైంది. ఈ కాలంలో విరాట్ 10 వన్డే మ్యాచ్‌లో ఆడి రెండు సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 603 పరుగులు చేశాడు. దీనిలో భాగంగానే 75.37 సగటును, 94.81 స్ట్రైక్ రేట్‌ను సాధించాడు. 
 
కాగా, న్యూజిలాండ్‌తో వన్డేలో దాన్ని స్మిత్ అధిగమించాడు. మరొకవైపు వన్డేల్లో ఈ ఏడాది వెయ్యి పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా స్మిత్ గుర్తింపు సాధించాడు. అంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ ఈ మార్కును చేరిన తొలి ఆటగాడు కావడం గమనార్హం.