శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 అక్టోబరు 2014 (18:59 IST)

కోహ్లీ సెంచరీ బాదుడు: రైనా, రహానే అదుర్స్.. టీమిండియా 330 రన్స్!

ధర్మశాలలో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గాడిలో పడ్డాడు. ఇంతకాలం ఫామ్ లేమితో ఇక్కట్లు పడిన విరాట్ కోహ్లీ ఏకంగా సెంచరీతో అదరగొట్టాడు. అలాగే కోహ్లీ రైనాకు చక్కటి సహకారం అందించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
 
టీమిండియా, విండీస్‌ల మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో భాగంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల పతనానికి 330 పరుగులు సాధించింది. 
 
విరాట్ కోహ్లీ విమర్శకులకు తన బ్యాటింగ్ సమాధానమిస్తూ.. 114 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 127 పరుగులు చేయడంతో టీమిండియా భారీ స్కోరుకు బాటలు వేసింది. అతనికి రైనా (71), రహానే (68) అద్భుత సహకారమందించారు. 
 
ఇంకా ధావన్ (35) కూడా రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో టేలర్, హోల్డర్, రసెల్, బెన్ తలో వికెట్ తీశారు. తద్వారా భారత్ 331 పరుగుల విజయ లక్ష్యాన్ని వెస్టిండీస్‌కు నిర్దేశించింది.