సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: సోమవారం, 27 సెప్టెంబరు 2021 (18:46 IST)

భార్యను పక్కనబెట్టుకుని ప్రియురాలితో వీడియో కాల్స్

పెద్దలు ఒప్పించడంతో ఇష్టంలేని పెళ్ళి చేసుకున్నాడు. భార్యను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. ఇంకేముంది ఆమెకు నరకం చూపించాడు. తను ప్రేమించిన ప్రియురాలితో వీడియో కాల్స్ చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. అంతేకాదు అర్థనగ్నంగా కూర్చుని.. ఆమెను అలాగే కూర్చోమని చెప్పి భార్యకు చూపించేవాడు. భర్త మానసిక హింసను తట్టుకోలేని ఆ అభాగ్యురాలు పోలీసులను ఆశ్రయించింది.
 
ఢిల్లీలోని ఎస్‌జిఎం నగర్‌కు చెందిన రూబీకి బెల్కం ఉడ్ మార్కెట్‌కు చెందిన ఫైజాన్‌తో ఈ సంవత్సరం మార్చి 20వ తేదీన వివాహం జరిగింది. 30 లక్షల రూపాయల కట్నంతో సమర్పించుకుని వివాహం చేశారు.
 
వివాహమైనప్పటి నుంచి భార్యను దగ్గరకు తీసుకోని భర్త ఆమెను మానసికంగా హింసిస్తూ ఉండేవాడట. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వు తెచ్చిన కట్నం మాత్రం నాకు చాలు. నువ్వు వెళ్ళిపో.. అంటూ ప్రియురాలితో ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుతూ ఉండేవాడట.
 
అంతేకాకుండా రూబీని కొట్టేవాడట. భర్త చిత్రహింసలకు గురిచేసినా రూబీ మాత్రం అక్కడే ఉండేది. కానీ గత వారంరోజులుగా అర్థనగ్నంగా ప్రియురాలితో వీడియోలు మాట్లాడుతూ ఆమెను అలాగే కూర్చోమని చెప్పి భార్యను పిలిపించి వీడియోలను చూపించాడట. 
 
దీంతో భర్త మానసిక హింసను తట్టుకోలేని ఆ అభాగ్యురాలు భర్తపై ఫిర్యాదు చేసిందట. ఆ వీడియోలను కోర్టుకు కూడా చూపించిందట. తనకు న్యాయం చేయాలని.. తన భర్త విడాకులు ఇస్తానని బెదిరిస్తున్నట్లు ఆ అభాగ్యురాలు న్యాయమూర్తి  ముందు తన ఆవేదనను వెల్లగక్కిందట.