బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్మెయిల్తో మళ్లీమళ్లీ ఘోరం
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. బాలికపై అత్యాచారం చేసిన కామాంధులు వీడియో తీసి మళ్లీమళ్లీ బ్లాక్ మెయిల్ చేస్తూ ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం మేరకు.. కర్నాటక రాష్ట్రంలోని బెళగావి ప్రాంతానికి చెందిన ఓ నిందితుడు ఓ బాలికకు మంచి స్నేహితుడు. ఆరు నెలల క్రితం తన స్నేహితుడు పిలవడంతో బాలిక అతనితో కలిసి ఓ కొండ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ఆ 15 యేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుశ్చర్యను నిందితులంతా తమతమ ఫోన్లలో చిత్రీకరించారు.
తమ మాట వినకపోతే ఆ వీడియోను ఆన్లైన్లో పెడతామంటూ బెదిరించి తాజాగా మరోసారి బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈసారి కూడా ఈ కిరాతక చర్యను రికార్డు చేసి బెదిరింపులు కొనసాగించారు. దీంతో బాలిక శనివారం పోలీసులను ఆశ్రయించడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, మిగిలిన పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.