శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (18:43 IST)

మూవింగ్ కారులో టీనేజ్ బాలికపై సామూహిక అఘాయిత్యం!

victim girl
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మూవింగ్ కారులో టీనేజ్ బాలికపై సామూహిక అఘాయిత్యం జరిగింది. కణతకు తుపాకీ గురిపెట్టిమరీ బెదిరించారు. ఈ దారుణానికి పాల్పడింది ముగ్గురు వ్యక్తులు కావడం గమనార్హం. ఈ ఘటన బీహార్‌లోని సహర్షా జిల్లాలో ఈనెల 14న చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 
 
దీనిపై జిల్లా ఎస్పీ హిమాన్షు మాట్లాడుతూ.. 'ఈ నెల 14వ తేదీన సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకోగా.. బాలిక సోమవారం సదర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశాం. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించాం. 
 
ఇంకా నివేదిక రావాల్సి ఉంది. ఈ వ్యవహారంలో ఒకరిని అరెస్టు చేయగా.. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నాం. తుపాకీతో బెదిరించారా? లేదా? అనే అంశంతో పాటు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. నిందితులు ఉపయోగించిన కారును సీజ్‌ చేశాం' అని తెలిపారు.