మంగళవారం, 8 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 ఏప్రియల్ 2025 (08:25 IST)

కన్నబిడ్డపై ప్రియుడు అత్యాచారం చేస్తుంటే గుడ్లప్పగించి చూసిన కన్నతల్లి!!

Lady victim
కేరళ రాష్ట్రంలో అమానుష ఘటన ఒకటి వెలుగు చూసింది. తన కళ్లముందే కన్నబిడ్డపై తన ప్రియుడు అత్యాచారం చేస్తుంటే ఓ కసాయి తల్లి గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తల్లి.. ప్రియుడు చేస్తున్న పాడుపనులకు వత్తాసు పలికింది. ఈ కేసులో ఆ తల్లికి 40 యేళ్ల జైలుశిక్ష పడింది. ఈ మేరకు తిరువనంతపురం కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మానసికస్థితి సరిగ్గాలేని భర్తను వదిలిపెట్టి తన 7 యేళ్ల కుమార్తెను తీసుకుని ఓ మహిళ శిశుబాలన్ అనే వ్యక్తితో ఉండసాగింది. ఈ క్రమంలో ఏడేళ్ల మైనర్ బాలికపై కన్నేసిన కామాంధుడు... ఆ చిన్నారిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా, కన్నతల్లి ముందే అత్యాచారం చేసేవాడు. తన ప్రియుడు పనులను ఆ మహిళ చూస్తూ మిన్నకుండిపోయేది. దీంతో శిశుబాలన్ మరింతగా రెచ్చిపోసాగాడు.
 
ఈ క్రమంలో తమ ఇంటికి చుట్టపుచూపుగా వచ్చిన 11 యేళ్ల బాలికపై కూడా శిశుబాలన్ అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే, బాధిత బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఆ మహిళ తల్లికి చెప్పింది. దాంతో ఆమె తన కుమార్తెకు ఫోన్ చేసి సమాచారం చెప్పింది. పైగా, శిశుబాలన్‌కు దూరంగా ఉండాలని చెప్పింది. కానీ, ఆమె తల్లిమాటలు వినిపించుకోలేదు. 
 
ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత తనంతట తానే అతనికి దూరమై మరో వ్యక్తితో కలిసి జీవించసాగింద. అతడు కూడా ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి అనుభవిస్తున్న నరకాన్ని చూసిన పెద్దమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసల విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక తల్లి, ఆమె రెండో ప్రియుడుని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ తిరువనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టులోసాగింది దీంతో కన్నకుమార్తె పట్ల కర్కశంగా ప్రవర్తించిన తల్లికి న్యాయస్థానం 40 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.