మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By Selvi
Last Updated : శనివారం, 18 అక్టోబరు 2014 (18:49 IST)

దీపావళి రోజున నువ్వుల నూనెతోనే దీపాలు పెట్టాలట!

దీపావళి రోజున దీపాల వెలుగులు తమ ఇంటి ముందు వెదజల్లాలని స్త్రీలు తాపత్రయ పడతారు. ఇందులో భాగంగా కొత్త బట్టలు, తీపి వంటలు, టపాకాయలు వంటివి సిద్ధం చేసుకుని సాయంత్రానికల్లా దీపాలు పెట్టేందుకు సిద్ధమవుతారు. అయితే దీపాలకు ఉపయోగించే నూనె ఏది ఉపయోగించాలో కొందరు తెలియకపోవచ్చు. 
 
దీపావళి రోజున నెయ్యితో దీపమెలిగించినా ఫలితం లేదని నువ్వులనూనెతోనే దీపాలు పెట్టాలని పండితులు అంటున్నారు. ఎందుకంటే దీపావళి రోజున లక్ష్మీదేవి నువ్వులనూనెలోనే నివాసముంటుంది. అందుకే దీపాలు పెట్టాలనే నియమం పాటించడం ఆనవాయితీగా వస్తుందని పురోహితులు అంటున్నారు. దీపావళి రోజున దీపాలు పెట్టడం ద్వారా ఆ లక్ష్మీదేవి ఆయా ఇళ్లలో నివాసముంటుందని వారు చెబుతున్నారు.  
 
దీపం వెలుగులు ఎక్కడైతే విరజిమ్ముతూ ఉంటాయో అక్కడ దుష్ట శక్తులు నిలవలేవు. అలాంటి దివ్యమైన వెలుగులు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంటాయి. అందువల్లనే ఈ రోజున నువ్వులనూనెతో దీపాలు పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించి పూజిస్తూ వుంటారు. ఆ తల్లి అనుగ్రహంతో సిరిసంపదలను పొందుతుంటారు. అందుచేత ఈ దీపావళి రోజున నువ్వుల నూనెతో దీపమెలిగించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందుదురుగాక.