శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 31 మార్చి 2015 (15:03 IST)

నా భార్య ఇపుడే పిల్లలు వద్దంటోంది.. ఏం చేయాలి... సలహా ఇవ్వండి?

వివాహమై నాలుగు నెలలు అయింది. సెక్స్‌లో పాల్గొన్న ప్రతీసారి వీర్యాన్ని యోనిలో స్ఖలించనీయకుండా నా భార్య నెట్టేస్తోంది. ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అడిగితే.. అపుడే పిల్లలు వద్దంటోంది. నాకేమో.. పిల్లలు కావాలని ఉంది. కానీ, ఆమె మాట కాదనలేదు. ఏం చేయాలి. సెక్స్‌లో పాల్గొనేటపుడు ఎలాంటి కండోమ్ వంటివి ధరించడం నాకు ఇష్టం లేదు. ఏం చేయాలి. సలహా ఇవ్వండి. 
 
సాధారణంగా నేటి కాలం యువతీయువకులు వివాహమైన తర్వాత వెంటనే పిల్లలు కావాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే.. పెళ్లి కాగానే పిల్లల్ని కనేసి, ఆ తర్వాత వారి ఆలనాపాలనా చూసుకుంటూ ఆ బరువు బాధ్యతలను నెత్తిన వేసుకునేందుకు ఏ జంటా సిద్ధంగా లేదు. వివాహం అయిన తర్వాత జీవితాన్ని కాస్తంత హ్యాపీగా కొన్నాళ్లపాటు స్వేచ్ఛగా అనుభవించాలని కోరుకుంటున్నారు. 
 
అలా కొన్నాళ్లపాటు పిల్లల్లేకుండా ఉండాలంటే శృంగారంలో పాల్గొన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై కొత్త జంటల్లో అనేక అనుమానాలు, అపోహలు గూడుకట్టుకుని ఉంటాయి. అటువంటి వారికి సెక్సాలజిస్టులు ఈ క్రింది సలహాలు చెపుతున్నారు.
 
స్త్రీతో మెన్సస్ ప్రారంభమైన 9వ రోజు నుంచి 17వ రోజు వరకూ సెక్స్‌లో పాల్గొంటే అవి అండం విడుదలయ్యే రోజులు కనుక ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందని చెపుతున్నారు. అయితే, మెన్సస్‌కు ముందు 8 రోజులు, మెన్సస్ తర్వాత 18వ రోజు నుంచి 28వ రోజు వరకూ సెక్స్‌లో పాల్గొంటే ప్రెగ్నన్సీ రాదని వారు చెపుతున్నారు. 
 
ఎందుకంటే.. మొదటి 8 రోజులు మెన్సస్ అయిన తర్వాత 11 రోజులు సేఫ్ పీరియడ్‌గా చెప్పవచ్చు. ఈ పద్ధతి కేవలం కేవలం 28 రోజులకు ఒకసారి సక్రమంగా మెన్సస్ అయ్యే స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంది. అలాకాక కొందరు 21 రోజులకు, మరికొందరు 30 రోజులకు, ఇంకొందరు 35, 38 రోజులకు అవుతుంటారు. అటువంటివారు ముందుగా అండం విడుదల ఎప్పుడవుతుందో తెలుసుకుని దాని ప్రకారం రతిలో పాల్గొన్నట్టయితే గర్భం రాకుండా జాగ్రత్తపడొచ్చు.