శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : గురువారం, 5 జులై 2018 (09:45 IST)

అన్నంపై ఉండే అపోహలు...

దేశంలో 70 నుంచి 80 శాతం మంది ప్రజలు వరి బియ్యంతో తయారు చేసే అన్నమే ఆరగిస్తుంటారు. ఈ అన్నంలోకి తమకు ఇష్టమైన రుచికరమైన కూరలను తయారు చేసుకుని అందులో కలుపుకుని ఆరగిస్తుంటారు. అయితే అన్నం తినడంపై చాలా మంది

దేశంలో 70 నుంచి 80 శాతం మంది ప్రజలు వరి బియ్యంతో తయారు చేసే అన్నమే ఆరగిస్తుంటారు. ఈ అన్నంలోకి తమకు ఇష్టమైన రుచికరమైన కూరలను తయారు చేసుకుని అందులో కలుపుకుని ఆరగిస్తుంటారు. అయితే అన్నం తినడంపై చాలా మందికి పలు అపోహలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
* సాధారణంగా రాత్రిపూట చాలా మంది అన్నంకు బదులు చపాతీ, టిఫన్ వంటివి తీసుకుంటుంటారు. వీటికంటే అన్నం ఆరగించడమే ఉత్తమమని వైద్యులు చెపుతున్నారు. ఎందుకంటే.. అన్నం తినడం వల్ల చక్కగా నిద్ర పడుతుంది. దీంతో లెప్టిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. 
 
* మన శరీరంలో శక్తిని బాగా ఖర్చు చేస్తుంది. కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. దీంతోపాటు ఆకలి వేయకుండా ఉంచుతుంది. కనుక రాత్రి పూట నిర్భయంగా అన్నం తినవచ్చు.  
 
* ముఖ్యంగా దేశంలో చక్కెర వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. వీరంతా రాత్రిళ్లు అన్నం మానేసి చపాతీలు, వివిధ రకాల రొట్టెలు ఆరగిస్తుంటారు. నిజానికి మధుమేహం ఉన్న వారు నిర్భయంగా అన్నం తినవచ్చు. 
 
* తక్కువ మోతాదులో అన్నం తినడంతోపాటు దాంట్లో పప్పులు, కూరగాయలు, నెయ్యి వంటి ఆహారాలను చేర్చుకుంటే భోజనం చేసిన వెంటనే షుగర్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఇలా డయాబెటిస్ ఉన్నవారు కూడా అన్నంతిన్నట్టయితే చక్కెర నిల్వల స్థాయిని నియంత్రణలో ఉంచుతాయని చెపుతున్నారు. 
 
* అన్నం తినడం వల్ల శరీరంలో కొవ్వు చేరదు. నిత్యం మనం తినే జంక్‌ఫుడ్, నూనె పదార్థాలు, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్లే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. దీన్ని నివారించాలంటే అన్నం ఆరగించడమే ఉత్తమం.