1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Updated : మంగళవారం, 27 మార్చి 2018 (19:13 IST)

పెరుగులో పంచదార కలుపుకుని తింటే...

ఏ కాలంలోనైనా ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా చాలామంది ఇష్టంగా తినే పదార్థం పెరుగు. అయితే పెరుగు తినడానికి ఇష్టపడనివారు కొందరు ఉంటారు. అలా కాకుండా పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుని, వాటిని దృ

ఏ కాలంలోనైనా ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా చాలామంది ఇష్టంగా తినే పదార్థం పెరుగు. అయితే పెరుగు తినడానికి ఇష్టపడనివారు కొందరు ఉంటారు. అలా కాకుండా పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుని, వాటిని దృష్టిలో ఉంచుకుని పిల్లులూపెద్దలూ అందరూ తీసుకోవలసిన ఆహార పదార్థం పెరుగు. దీనిలో శారీరక రుగ్మతలను తగ్గించే గుణం మెండుగా ఉంది. అవేంటో చూద్దాం.
 
1. జలుబుతో బాధపడేవారు పెరుగులో మిరియాల పొడిని, బెల్లం పొడిని కలిపి తింటే ఉపశమనం కలుగుతుంది. 
 
2. పెరుగు తినడానికి ఇష్టపడనివారు మజ్జిగ చేసి దాంట్లో నిమ్మరసం, కొంచెం ఉప్పు, జీలకర్ర పొడి వేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
 
3. వేడి అన్నంలో పెరుగు కలుపుకని తింటే విరేచనాలు తగ్గుతాయి. పెరుగులో కొంచెం మెంతులు కలుపుకుని తింటే జిగట విరేచనాలు తగ్గుతాయి.
 
4. పెరుగుకు వాతాన్ని హరించే శక్తి ఉంది. పెరుగులో ఉప్పు కలుపుకుని తింటే అజీర్తి వ్యాధి తగ్గుతుంది. 
 
5. వంటికి నీరు పట్టినవారు పెరుగు ఎక్కువగా తినాలి. కఫాన్ని త్వరగా తగ్గించే గుణం పెరుగుకు ఉంది.
 
6. పెరుగులో పంచదార కలుపుకుని తింటే అధిక వేడి చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. మతిమరుపు తగ్గి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పెరుగు పదార్థాలు తింటే వేడి శరీరం వారికి మంచిది. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే శక్తి మెరుగవుతుంది.