శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 30 నవంబరు 2018 (12:19 IST)

ఎరుపు రంగు పండ్లలో ఏమున్నదో తెలుసా? వాటిని తింటేనా?

పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తినటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ముఖానికి మంచి మెరుపు వస్తుంది. శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు అందుతాయి. అవి ఏమిటో ఒకసారి చూద్దాం.
 
1. ఎరుపు రంగు పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి వంటివి క్యాన్సర్‌ను అడ్డుకుంటాయి. గుండె జబ్బులను దరిచేరకుండా కాపాడతాయి. చర్మ సంబంధ సమస్యలు దరి చేరనీయవు. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 
2. పుచ్చకాయలో గుండెకు మేలు చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ పండు రక్తపోటును నియంత్రిస్తుంది. అత్యధిక పొటాషియం కూడా పుచ్చకాయలో లభిస్తుంది.
 
3. ఎరుపు రంగు క్యాప్సికమ్ ఆరోగ్యానికి ఎంతో ఉపకరించే కూరగాయలలో ఒకటి. ఇందులోని సోడియం, పొటాషియం, మెగ్నీషియం బ్లడ్ ప్రెషర్‌ను నిలకడగా ఉంచుతుంది.
 
4. టమోటా వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇవి శరీరానికి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. ఇందులో ఉండే లైకోపిన్ శక్తివంతమైన యాంటీఆక్సిడంట్‌గా పని చేస్తుంది. టమోటాలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. టమోటాను రోజు తీసుకోవడం వల్ల నిత్య యవ్వనంగా కనిపిస్తారు.
 
5. యాంటీ ఆక్సిడెంట్స్, యాంధోసియానిన్ దానిమ్మలో అధికంగా ఉంటాయి. శరీరంలోని వాపులను నియంత్రించే గుణం ఈ పండు సొంతం. రక్తనాళాలలో అడ్డంకులను తొలగించే శక్తి దానిమ్మకు ఉంది. ఈ పండును తీసుకోవడం వల్ల  కీళ్లనొప్పులు, వాతం కూడా తగ్గుతాయి. ఇందులోని లైకోపిన్ క్యాన్సర్‌ను అడ్డుకుంటుంది.