1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Modified: గురువారం, 23 ఏప్రియల్ 2015 (08:06 IST)

కొండపై పెళ్ళిళ్లే పెళ్లిళ్ళు

నవదంపతులతో తిరుమల కిటకిటలాండింది. ఎక్కడ చూసినా పెళ్ళిళ్ల హాడావుడినే కనిపించింది. తలకు బాసికాలతో వధూవరులు తిరుమలంతా కలియదిరిగారు. ముహూర్తాలు తక్కువగా ఉండడంతో బుధ, గురువారాలలో వందల మంది పెళ్ళిళ్లు చేసుకున్నారు. బుధవారం వేకువజాము నుంచి రాత్రి వరకు అధిక సంఖ్యలో వివాహ మూహూర్తాలుండడంతో నూతన జంటలు, బంధువులతో తిరుమల కళకళలాడింది.
 
పౌరోహిత సంఘంతో పాటు టీటీడీ, మఠాల్లోని కల్యాణమండపాల్లో 200కు పైగా వివాహాలు జరిగాయి. మంగళవాయిద్యాల ధ్వునులతో కల్యాణవేదిక మారుమ్రోగింది. పౌరోహితుల మంత్రాలు, బంధువుల అల్లరి మాటలు, దంపతుల తల్లిదండ్రుల హడావుడితో కల్యాణవేదికపై సందడి నెలకొంది. గురువారం తెల్లవారు జామున వరకూ ఇదే పరిస్థితి కొన సాగింది. 
 
పెళ్లిళ్లు జోరుగా జరగడంతో బాజాభజంత్రీలు, పూలమాలలు, ఇతర పూజా వస్తువులు, విందు భోజనాలకు పూర్తిగా డిమాండ్ పెరిగింది.  నూతన దంపతుల కళతో ఆలయం ప్రాంగణం కొత్తగా కనిపించింది. స్వామిని దర్శించుకున్న అనంతరం నూతన వధూవరులు అఖిలాండం వద్దకు చేరుకుని  కొబ్బరికాయలను సమర్పించారు.