1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Modified: మంగళవారం, 3 మార్చి 2015 (07:56 IST)

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 43,976 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం రాత్రికి  5 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి సర్వ దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరికి కనీసం 6 గంటల సమయం పడుతోంది. 
 
నడక దారిన వచ్చే భక్తులు 3 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి కనీసం 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనం ఉదయం పదిగంటల పైన ప్రారంభం అవుతోంది. ఇక భక్తులకు గదులు కూడా సులభంగానే లభిస్తున్నాయి.