1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2015 (10:15 IST)

తిరుమలలో మత్తుమందిచ్చి చోరీ... కౌస్తభం గెస్ట్‌హౌస్‌లో సంఘటన

తిరుమలలో దొంగలు హల్ చల్ చేశారు. ఓ గెస్ట్‌హౌస్‌ ఉంటున్న మహిళలకు మత్తుమందిచ్చి చోరీకి పాల్పడ్డారు. గురువారం తెల్లవారు జామున జరిగిన సంఘటనలో ఓ మహిళా ఇంకా స్పృహలో నుంచి బయటకు రాలేదు. వివరాలిలా ఉన్నాయి. 
 
తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను తిలకించడానికి తమిళనాడులోని కాంచీపురానికి చెందిన ఓ కుటుంబం తిరుమలకు వచ్చింది. కౌస్తభం అతిథిగృహంలో గది నంబర్ 235లో విడిది చేశారు. రాత్రి వాహన సేవను చూసుకుని గదికి చేరుకున్నారు. అయితే అప్పటికే వారు శరీరంపై నగలు, వారిస్థితిని గమనించి దొంగలు వారిపై కన్నేశారు. 
 
మాటలు కలిపి మత్తుమందిచ్చారు. మహిళలు స్పృహతప్పి పడిపోయిన వెంటనే వారి శరీరంపై బంగారు నగలను, నగదు దోచుకుపోయారు. స్పృహలోకి వచ్చిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో మహిళ ఇంకా స్పృహలోకి రాలేదు.