శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 నవంబరు 2020 (19:23 IST)

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? (video)

ప్రస్తుతం మన దేశంలో చక్కెర వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పలు దఫాలుగా హెచ్చరికలు చేస్తోంది. వచ్చే 2050 నాటికి భారత్‌లో 60 కోట్ల మంది మధుమేహ రోగులు ఉంటారని హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ జీవనశైలిని మార్చుకుని ముందుకుసాగినట్టయితే ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. అయితే, ఒకసారి ఈ వ్యాధిబారినపడితే చక్కెర రోగగ్రస్తులు ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న అంశాన్ని తెలుసుకుందాం. 
 
* ముందుగా అన్నం, గోధుమలు, మైదా, చక్కెర నిలిపి వేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది.
* ప్రతి రోజు రాగిజావలో మజ్జిగ పోసుకొని త్రాగుతుంటే మధుమేహం తగ్గుతుంది. 
* మొలకెత్తిన మెంతుల పొడిని, ప్రతి రోజు రెండు పూటలు ఒక చెంచా చొప్పున సేవిస్తుంటే మధుమేహం తగ్గుతుంది.
* ప్రతీ రోజు ఉదయాన్నే గ్లాసు నీటిలో గుప్పెడు కొత్తిమీరకాడలతో సహా వేసి 3-4 నిమిషాలు ఉడకబెట్టి, వడగట్టి గోరువెచ్చగా త్రాగాలి.
 
* 1.5 గంటలు నడక, జాగింగ్ లేదా ఏదైనా శారీరక వ్యాయామం తప్పనిసరి.
 
మధుమేహ రోగులు తినకూడని ఆహార పదార్థాలు. (బంగాళాదుంపలు, కంద వంటి మూల కూరగాయలు, మామిడి పండ్లు, అరటి కాయ)
తినాల్సినవి (ఆపిల్, నారింజ, స్ట్రాబెర్రీ, జామకాయ, పియర్, కివి, బొప్పాయి)
 
* అలాగే, చిరు ధాన్యాలు ఒక్కోటి 2 రోజుల చొప్పున తీసుకోవాలి. అంటే ఊదలు, అరికలు, కొర్రలు, అండు కొర్రలు, సామలు వంటి తినాలి.
* చిరుధాన్యాలతో అన్ని రకాల అల్పాహారం చేసుకుని ఆరగించవచ్చు. రాత్రి భోజనం రాగులు, జొన్నలు, సజ్జలతో చేసుకోవాలి.