శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 11 మే 2017 (15:31 IST)

భారత్ పెయిన్స్ కిల్లర్స్ వాడుతున్న ఐఎస్ టెర్రరిస్టులు.. చిన్నపిల్లలకు ఆయుధాలిచ్చి.. ఈ మాత్రల్ని కూడా?

భారత్‌లో తయారయ్యే మాత్రలు ఐఎస్ ఉగ్రవాదులకు సరఫరా అవుతున్నాయట. భారత్‌లో తయారై.. లిబియాలోని ఐస్ టెర్రర్ మూకల కోసం 37 మిలియన్ల 'ట్రమడోల్' మాత్రలను ఇటలీ పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

భారత్‌లో తయారయ్యే మాత్రలు ఐఎస్ ఉగ్రవాదులకు సరఫరా అవుతున్నాయట. భారత్‌లో తయారై.. లిబియాలోని ఐస్ టెర్రర్ మూకల కోసం 37 మిలియన్ల 'ట్రమడోల్' మాత్రలను ఇటలీ పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ మాత్రలను ఉగ్రవాదులు తమకు ఏర్పడిన గాయాల నుంచి కలిగే నొప్పిని తట్టుకునేందుకు విరివిగా వాడుతున్నట్లు బ్రిటన్ దినపత్రిక ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ మాత్రలు ఏ డ్రగ్ కంపెనీలో తయారయ్యాయని, ఎవరు బట్వాడా చేస్తున్నారనే విషయంలో ఇటలీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
భారత్‌లో తయారవుతున్న వీటిని ఓ దుబాయ్ దిగుమతి దారుడు ఆర్డర్ చేసుకుని.. శ్రీలంక మీదుగా తెప్పించుకున్నట్లు ఇటలీ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మాత్రలను ఐఎస్ టెర్రరిస్టులే కాకుండా నైజీరియా ఉగ్రవాద సంస్థ బోకో హరామ్ కూడా ఈ మాత్రలను అధికంగా వాడుతోందని ఇటలీ పోలీసులు తెలిపారు.

తమ వద్ద ఉన్న చిన్న పిల్లలకు ఆయుధాలు ఇచ్చి యుద్ధానికి పంపుతున్న బోకో హరామ్, వారికి ఈ మాత్రలను కూడా అందిస్తోంది. వీటితో పాటు ఆకలిని చంపే కాప్టాగాన్, ఆంఫిటామైన్ ఔషధాలను కూడా ఉగ్రవాద సంస్థలు వాడుతున్నాయని పోలీసులు వెల్లడించారు.