మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జనవరి 2020 (10:07 IST)

చైనాలో కలకలంరేపుతున్న కరోనా.. గబ్బిలాన్ని తిన్న యువతి (వీడియో వైరల్)

చైనా దేశంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ అనేక మందికి సోకింది. ఈ వైరస్ బారినపడిన అనేక మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయింది. వేలాదికి ఈ వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ వైరస్‌కు విరుగుడు గబ్బిలం మాంసం, గబ్బిలం ఎముకలతో చేసిన సూప్ అనే ప్రచారం సాగుతోంది. దీంతో అనేకమంది గిబ్బలంను ఆరగించేందుకు పోటీపడుతున్నారు. 
 
తాజాగా, ఓ యువతి రెస్టారెంట్‌లో కూర్చున్న గబ్బిలంతో చేసిన సూప్‌ను కూడా తాగేసింది. వండిన గబ్బిలాన్ని ఆమె ఎంత ఇష్టంగా తిందంటే.. మాంసమేకాకుండా దాని చర్మాన్ని కూడా తీనేందుకు యత్నించింది. చర్మం తినకూడదని అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమెకు చెప్పారు.
 
చైనాలో కరోనా వైరస్‌ కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు బలిగొని, మరో 600 మందికి వ్యాపించింది. పాము, గబ్బిలాల నుంచే ఈ వైరస్ మనుషులకు వ్యాపించినట్టు పెకింగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ చైనా యువతి ఇలా గబ్బిలాన్ని తినేసింది. ఈ వీడియోను మీరు కూడా తిలకించండి.