1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 22 అక్టోబరు 2017 (17:51 IST)

దీపావళి సంబరాలు.. వెలుగులతో ప్రకాశిస్తున్న భారత్.. ఫోటో చూడండి..

దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. దీపాల కాంతులతో ఆలయాలు, ఇళ్లు మెరిసిపోయాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా టపాసులు పేల్చి ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. ఆ వెలుగులతో భారత దేశ

దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. దీపాల కాంతులతో ఆలయాలు, ఇళ్లు మెరిసిపోయాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా టపాసులు పేల్చి ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. ఆ వెలుగులతో భారత దేశం ప్రకాశించింది. ఈ నేపథ్యంలో దీపావళి నాడు అంతరిక్షం నుంచి తీసిన భారతదేశ ఫొటోను ఓ వ్యోమగామి ట్విట్టర్లో పంచుకున్నారు. 
 
పండగ కాంతులీనుతున్న భారత్‌ పొటోను ఇటలీకి చెందిన పాలో నెస్పోలీ అనే వ్యోమగామి అక్టోబర్‌ 19న ట్వీట్‌ చేశారు. దీపావళి శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ ఫొటో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఇప్పటికే వేల సంఖ్యలో లైక్‌లు, రీట్వీట్లు అందుకుంది. ఈ ఫోటోను ట్వీట్ చేసినందుకు భారతీయులందరూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దీపావళి పర్వదినం రోజు, వాడవాడలా టపాకాయలు పేలుతుంటే, మరోవైపు దీపాలు వెలుగుతున్న ఆ దృశ్యం ఎలా వుందో మీరూ చూడండి..