1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (15:01 IST)

ఇరాక్‌లో కారుబాంబు పేలుడు : 13 మంది మృతి

ఇరాక్‌లో కారుబాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాక్ రాజధానిలో ఆత్మాహుతి దాడులు సాధారణమైపోయింది. తాజాగా  ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఓ కారు బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో 13 మంది మరణించగా 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
పేలుళ్ల ధాటికి సమీపంలోని పలు భవనాలు, వాహనాలు కుప్పకూలాయి. ఈ మధ్య కాలంలో ఇరాక్‌లో ఉగ్రవాదులు జరిపిన హింసాకాండలో 1420 మంది మరణించారు. 1370 మంది గాయపడ్డారు. కాగా కారుబాంబు పేలుడులో గాయపడిన వారిని సహాయక సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.