ఇరాక్లో కారుబాంబు పేలుడు : 13 మంది మృతి
ఇరాక్లో కారుబాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాక్ రాజధానిలో ఆత్మాహుతి దాడులు సాధారణమైపోయింది. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఓ కారు బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో 13 మంది మరణించగా 45 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పేలుళ్ల ధాటికి సమీపంలోని పలు భవనాలు, వాహనాలు కుప్పకూలాయి. ఈ మధ్య కాలంలో ఇరాక్లో ఉగ్రవాదులు జరిపిన హింసాకాండలో 1420 మంది మరణించారు. 1370 మంది గాయపడ్డారు. కాగా కారుబాంబు పేలుడులో గాయపడిన వారిని సహాయక సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.