శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (16:05 IST)

ఒకటి కాదు.. రెండు కాదు.. 6వేల అరుదైన చేపలను చంపేసిన చైనా.. ఎలా?

అవును.. చైనా చేసిన పనికి అక్వా ఫామ్‌లోని ఆరువేల అరుదైన చేపలు మరణించాయి. చైనా హుబే ప్రావిన్స్ వద్ద ఓ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది. వ్యవసాయ భూమిలో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టినట్లు ఇప్పటికే ఆ ప్రాంత రైతులు వాపోతున్నారు. ఇందుకు తోడుగా హుబేయి ప్రావిన్స్‌లో చైనా చేపట్టిన వంతెన నిర్మాణానికి ఆరువేల చేపలు మరణించినట్లు ఆ దేశ మీడియా కోడైకూస్తోంది. 
 
నిర్మాణ పనుల్లో ఏర్పడిన శబ్ధం కారణంగా ఈ చేపలు మరణించినట్లు అధికారులు తేల్చారు. అక్వారియం బ్రిడ్జ్ నిర్మాణంతో కాలుష్యం ఏర్పడిందని తద్వారా చేపలు మృతి చెందాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైడ్రోఎలక్ట్రిక్ డామ్‌లను యాగ్టే నదిపై నిర్మించిన కారణంగా అరుదైన చేపలు భారీ ఎత్తున మరణించాయని స్థానికులు మండిపడుతున్నారు. దీంతో చైనా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని నిలిపివేసింది.