ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 జూన్ 2020 (16:03 IST)

లడఖ్ సమస్యను పరిష్కరించేందుకు సిద్ధం - చైనా ప్రకటన

Ladakh
కరోనా మహమ్మారి చైనాలో పుట్టడంతో ఇప్పటికే ప్రపంచ దేశాలు డ్రాగన్ దేశంపై గుర్రుగా వున్నాయి. ఈ నేపథ్యంలో భారత్-చైనాల మధ్య వున్న లడఖ్ సమస్యను పరిష్కరించేందుకు డ్రాగన్ కంట్రీ సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు భారత్-చైనా మధ్య నెలకొన్న లడఖ్ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి తాము చిత్తశుద్ధితో ఉన్నామని శుక్రవారం చైనా ప్రకటించింది. 
 
సరిహద్దు సమస్యలపై శనివారం జరగనున్న మిలటరీ స్థాయి అధికారుల సమావేశానికి ఒక రోజు ముందు చైనా ఈ ప్రకటనను వెలువరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతానికైతే భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితి స్థిరంగా, అదుపులోనే వుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ తెలిపారు. 
 
సైన్యం, దౌత్యపరమైన మాధ్యమాలున్నప్పటికీ...తాము ఎప్పటిలాగానే సమాచారాన్ని చేరవేస్తున్నామని చెప్పారు. అలాగే సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు తాము చిత్తశుద్ధితో కట్టుబడి వున్నామని తెలిపారు.