శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2019 (18:31 IST)

పెరు వంతెనపై ముద్దుల్లో మునిగి ప్రాణాలు కోల్పోయిన ప్రేమజంట (Video)

ఓ ప్రేమ జంట ముద్దుల్లో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. తమ విధులు ముగించుకుని అర్థరాత్రి ఇంటికి వెళుతూ వెళుతూ బెత్లహాం(పెరు) వంతెనపై నిలబడి ముద్దుల్లో మునిగిపోయి ప్రమాదావశాత్తు కిందపడి చనిపోయారు. 
 
ఈ ప్రమాద వార్త వివరాలను పరిశీలిస్తే, పెరూ దేశానికి చెందిన మేబిత్‌ ఎస్పింజ్‌(34), హెక్టార్‌ విడాల్‌(36) అనే ఇద్దరు ప్రేమికులు పర్వతారోహకులుగా పని చేస్తున్నారు. వీరిద్దరూ క్యూసో పట్టణంలో పర్యాటక గైడ్లుగా కూడా పని చేస్తున్నారు. అయితే, ఇటీవల ఈ ప్రేమ జంట ముగించుకున్న తర్వాత అర్థరాత్రి ఒంటి గంట సమయంలో తమ నివాసాలకు బయల్దేరారు.
 
మార్గం మధ్యలో ఈ ప్రేమికులిద్దరూ బెత్లెహాం వంతెనపై ఆగి ముద్దుల్లో మునిగిపోయారు. ప్రియురాలు బ్రిడ్జి రెయిలింగ్‌పై కూర్చొని ఉండగా, ప్రియుడు ఆ రెయిలింగ్‌ను సపోర్ట్‌ చేసుకుంటూ నిలబడ్డాడు. 
 
ప్రియురాలికి ప్రియుడు ముద్దు ఇస్తున్న క్రమంలో వారిద్దరూ ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుంచి కిందపడిపోయారు. 50 అడుగుల పైనుంచి కిందపడేసరికి ప్రియురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ప్రియుడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు.