బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2017 (12:28 IST)

చావుకు చిహ్నమైన నంబరుకు వేలం పాటలో రూ.12.8 కోట్ల ధర

తమ వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఆర్టీఏ కార్యాలయ ఉన్నతాధికారులు ఫ్యాన్సీ నంబర్లను వేలం వేస్తుంటారు. దీంతో ఈ తరహా నంబర్లకు భారీ ధర పలుకుతుంది.

తమ వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఆర్టీఏ కార్యాలయ ఉన్నతాధికారులు ఫ్యాన్సీ నంబర్లను వేలం వేస్తుంటారు. దీంతో ఈ తరహా నంబర్లకు భారీ ధర పలుకుతుంది. హైదరాబాద్‌లో జరిగే వేలం పాటల్లో ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకోవడంతో టాలీవుడ్ హీరోలు అమితాసక్తిని చూపుతుంటారు. ఇదే కోవలో ఓ ఆస్ట్రేలియా వాసి తనకు నచ్చిన ఫ్యాన్సీ నంబరును ఏకంగా రూ.12.8 కోట్లు చెల్లించి దక్కించుకున్నాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఆస్ట్రేలియాలోని సిడ్నీ రవాణాశాఖ కార్యాలయం ఇటీవల పలు నెంబర్లకు వేలం నిర్వహించింది. ఈ వేలంలో ‘ఎన్‌ఎస్‌డబ్ల్యూ 4’ నంబర్‌ ప్లేటు అక్షరాలా 2.45 మిలియన్‌ డాలర్ల (12.8 కోట్ల రూపాయల)కు అమ్ముడుపోయి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తొలుత ఈ నెంబర్‌కు 1.5 మిలియన్ల ధర పలికే అవకాశం ఉందని భావించగా, ఊహించని ధరకు పీటర్ సెంగ్ అనే చైనా సంతతి బిలియనీర్ దక్కించుకున్నాడు. 
 
వాస్తవానికి చైనీయులు 4 నెంబర్‌ను అశుభంగా, మరణానికి చిహ్నంగా భావిస్తారు. ఎరుపు రంగు ఫెరారీపై వేలానికి వచ్చిన ఆయన ఈ నెంబర్‌ను రికార్డు స్థాయి ధరకు కొనుగోలు చేశారు. కాగా, ఆయన వద్ద హాంకాంగ్ రిజిస్ట్రేషన్‌తో నెంబర్ 1 ప్లేటు ఉండటం విశేషం. 
 
ఈ రవాణా కార్యాలయంలో ఇంతవరకు 2003లో నిర్వహించిన వేలంలో ‘నంబర్‌ 2’ ప్లేటు పలికిన 6.8 మిలియన్ ఆసీస్‌ డాలర్ల ధరే అత్యధికం. దీంతో రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోవడం అంటే ఎలా ఉంటుందో ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఆర్టీఏ కార్యాలయ అధికారులు రుచిచూశారు.