శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (10:17 IST)

తొమ్మిది మందిని కాల్చిన ఉన్మాది.. తానూ ఆత్మహత్య..!

అమెరికాలో ఓ వ్యక్తి ఉన్మాదంతో రెచ్చిపోయి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది చనిపోగా, ఆ తర్వాత అతడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. టైరోన్ పట్టణానికి చెందిన ఒక ఉన్మాది ఈ కాల్పులు జరిపాడు. 
 
ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి వివిధ ప్రాంతాల్లో 9 మందిని కాల్చి చంపి తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పులు జరిపిన అనుమానితుడి మృతదేహాన్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన వాహనంలో నిందితుడి మృతదేహాన్ని, నాలుగు ఇళ్లలో బాధితుల మృతదేహాలను కనుగొన్నట్టు పోలీసులు వెల్లడించారు.