శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 సెప్టెంబరు 2015 (17:15 IST)

మక్కా మహా తొక్కిసలాట : 36కు చేరిన పాక్‌ మృతుల సంఖ్య

హజ్ యాత్ర సందర్భంగా మక్కా మసీదు వద్ద జరిగిన మహా తొక్కిసలాటలో మరణించిన పాకిస్థానీయుల సంఖ్య 36కు చేరింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ మంత్రి సర్దార్‌ మహ్మద్‌ యూసఫ్‌ వెల్లడించారు. 
 
ఈ తొక్కిసలాట జరిగిన తొలి రోజున 18 మంది మృతి చెందిన పాక్ అధికారులు భావించారు. అయితే, ఈ సంఖ్య సోమవారానికి 36కు చేరింది. మరో 35 మంది గాయపడగా, మరో 85 మంది జాడ తెలియరాలేదన్నారు. 
 
మరోవైపు ఇండోనేషియాకు చెందిన మృతుల సంఖ్య కూడా పెరిగింది. అంతకుముందు 35 మంది చనిపోయినట్లు భావించగా సోమవారం తాజాగా మరో 10 మృతదేహాలు లభ్యమయ్యాయి. మక్కా తొక్కిసలాటలో 45 మంది భారతీయులు చనిపోయారు. ఆ తొక్కిసలాటలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 769కు చేరింది.