1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (07:09 IST)

ఆయన అమెరికాను ప్రేమించారు.. అమెరికా అయన్ని ప్రేమించిందా: సునయన

జాత్యహంకారపు విషనాగు కాటుకు అన్యాయంగా బలైపోయిన శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన తన భర్త ముక్కూ మొఖమూ తెలియని వ్యక్తి చేతుల్లో చనిపోయేంత తప్పు పని ఏం చేశాడని అమెరికన్ ప్రబుత్వాన్ని నిలదీసి అడుగుతున్నారు.

"మంచోళ్లకు మంచే జరుగుతుందని నా భర్త చెప్పేవారు. మంచిగా ఆలోచించాలి. మంచి పనులే చేయాలి. అప్పుడు మంచే జరుగుతుందని చెప్పేవారు. పని ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్‌ అవుదామని ఆయన బార్‌కు వెళ్లారు. అక్కడికొచ్చిన వ్యక్తి జాత్యహంకారంగా మాట్లాడుతున్నా.. శ్రీనివాస్‌ పట్టించుకోలేదు. బయటకు వెళ్లొచ్చిన ఆ వ్యక్తి ఓ మంచి మనిషిని, అందరినీ ప్రేమించే వ్యక్తిని పొట్టన పెట్టుకున్నాడు. మా ఇద్దరి కుటుంబాల్లో విషాదం నింపాడు. శ్రీనివాస్‌ వాళ్ల అమ్మకు ఇప్పుడేమని సమాధానం చెప్పాలి?"
 
జాత్యహంకారపు విషనాగు కాటుకు అన్యాయంగా బలైపోయిన శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన తన భర్త ముక్కూ మొఖమూ తెలియని వ్యక్తి చేతుల్లో చనిపోయేంత తప్పు పని ఏం చేశాడని అమెరికన్ ప్రబుత్వాన్ని నిలదీసి అడుగుతున్నారు. అమెరికాలోని భారతీయులు కాని ఇతర ప్రాంతాల వారు కాని ఏనాడూ  అమెరికాకు చెడు తలపెట్టలేదని కానీ తమపని తాము చేసుకునిపోతున్న వారిపై ఈ దాడులకు, కాల్పులకు, హత్యలకు ఎవరు సమాదానం చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారామె. 
 
శ్రీనివాస్‌ ఉద్యోగం చేస్తున్న గార్మిన్ కంపెనీ శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన సునయన అమెరికన్ మౌలిక విలువలపై ప్రశ్నలు సంధించారు. కొంతకాలంగా అమెరికాలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మేం ఇక్కడి వారమా కాదా అని ఆశ్చర్యం కలుగుతోందని పేర్కొన్నారు.
 
ఇక్కడుండే ప్రతి ఒక్కరూ దేశానికి చెడు తలపెట్టరు. ఇక్కడ మా కుటుంబం బతకాలా వద్దా అనే అనుమానం వస్తోంది. విదేశీయులపై అమెరికాలో దాడుల వార్తలను చూసి బాధకలిగేది. మనం అమెరికాలో భద్రంగానే ఉంటామా అనే అనుమానం వచ్చేది. కానీ మంచోళ్లకు మంచే జరుగుతుందని నా భర్త చెప్పేవారు. మంచిగా ఆలోచించాలి. మంచి పనులే చేయాలి. అప్పుడు మంచే జరుగుతుందని చెప్పేవారు. పని ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్‌ అవుదామని ఆయన బార్‌కు వెళ్లారు. అక్కడికొచ్చిన వ్యక్తి జాత్యహంకారంగా మాట్లాడుతున్నా.. శ్రీనివాస్‌ పట్టించుకోలేదు. బయటకు వెళ్లొచ్చిన ఆ వ్యక్తి ఓ మంచి మనిషిని, అందరినీ ప్రేమించే వ్యక్తిని పొట్టన పెట్టుకున్నాడు. మా ఇద్దరి కుటుంబాల్లో విషాదం నింపాడు. శ్రీనివాస్‌ వాళ్ల అమ్మకు ఇప్పుడేమని సమాధానం చెప్పాలి’ అని సునయన ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
 
‘ఆయనకు ఇలాంటి చావొస్తుందనుకోలేదు. మరో రెండు వారాల్లో ఆయన 33వ పుట్టినరోజు జరుపుకోవాలి. ఆయన అమెరికాను బాగా ప్రేమించారు. చాలా సార్లు వేరే దేశానికి వెళ్లిపోదామా అని అడిగాను. కానీ వేచి చూద్దామనే ఆయన సమాధానమిచ్చారు. ఇప్పుడాయన మృతికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలని’ అని సునయన డిమాండ్‌ చేశారు. ‘మా ఆయన్ను పొట్టన పెట్టుకున్న వ్యక్తి వేరే బార్‌కు వెళ్లి ఇద్దరు ముస్లిం యువకులను చంపానని గర్వంగా చెప్పుకున్నాడని తెలిసింది. శరీరం రంగు చూసి ఓ వ్యక్తి ముస్లిమా హిందువా క్రిస్టియనా అని ఎలా గుర్తిస్తారు’ అని ఆమె ప్రశ్నించారు.
 
హైదరాబాద్‌లో అంత్యక్రియల కోసం భారత్‌కు బయలుదేరనున్న సునయన.. తన భర్త కలలను సాకారం చేసేందుకు కన్సాస్‌కు తిరిగి వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. ‘ఏ రంగంలోనైనా విజయం సాధించగలననే నమ్మకం నాకుంది. అయితే నా నిర్ణయాన్ని చెప్పేముందు అమెరికా ప్రభుత్వాన్ని అడుగుతున్నా.. ఇలాంటి విద్వేషపూరిత ఘటనలను ఆపేందుకు మీరేం చేస్తారో చెప్పండి’ అని ఆమె డిమాండ్‌ చేశారు.
 
2005లో కూచిభొట్ల అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌–ఎల్‌ పాసో (యూటీఈపీ)లో పీజీలో చేరేందుకు వచ్చారు. ఇదే యూనివర్సిటీలో చేరేందుకు ప్రయత్నించిన సునయనకు శ్రీనివాస్‌తో ఆన్ లైన్ లో స్నేహం కుదిరింది. 2007లో అమెరికా వచ్చిన సునయన మినసోటాలోని సెయింట్‌ క్లౌడ్‌ స్టేట్‌ యునివర్సిటీలో చేరారు. ఐదేళ్ల తర్వాత 2012లో వీరిద్దరూ వివాహం చేసుకుని న్యూ ఒలేత్‌లో ఇంటిని కొనుక్కున్నారు. కాగా, గార్మిన్  కంపెనీ ఆవరణలో శ్రీనివాస్‌కు ఉద్యోగులు ఉద్వేగపూరిత వాతావరణంలో ఘనంగా నివాళులర్పించారు.
 
బార్‌లో ఏం జరిగింది?
అమెరికాలోని కాన్సస్‌లోని ఆస్టిన్  బార్‌లో ఇద్దరు భారతీయులపై కాల్పుల ఘటనను.. బాధితుడు అలోక్‌ రెడ్డి న్యూయార్క్‌ టైమ్స్‌కు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్యూలో వెల్లడించారు. ‘బార్‌లో నేను (అలోక్‌) కూచిభొట్ల శ్రీనివాస్‌ కూర్చున్నాం. మాకు సమీపంలోనే పురింటన్ (కాల్పులకు పాల్పడిన వ్యక్తి) కూర్చున్నాడు. ఏ వీసాలపై వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు అక్రమంగా ఇక్కడ ఉంటున్నారా అని పురింటన్ అడిగాడు. దీనికి మేం స్పందించలేదు. చాలా మంది ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు అని లైట్‌ తీసుకున్నాం. కానీ మమ్మల్ని దూషిస్తూ.. వీరు అమెరికన్లు కారు అని గట్టి గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. అంతటితో ఆగకుండా బార్‌ మేనేజర్‌ను తీసుకొచ్చేందుకు లోపలకు వెళ్లాడు. ఆ తర్వాత ఏమైందేమో బయటకు వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత గన్  పట్టుకుని కోపంగా వచ్చిన పురింటన్  మాపై కాల్పులు జరిపాడు. కూచిభోట్ల అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నాకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న ఓ 24 ఏళ్ల అమెరికన్  యువకుడు పురింటన్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.అతన్నీ పురింటన్  కాల్చాడు’ అని అలోక్‌ రెడ్డి వెల్లడించారు.
 
ట్రంప్‌ వ్యాఖ్యలతో సంబంధం లేదు
అమెరికా అధ్యక్షుడు వలసలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే భారతీయ ఇంజనీర్‌ హత్యకు కారణమని వస్తున్న వార్తలను వైట్‌హౌస్‌ ఖండించింది. ‘ఇలాంటి ఘటనలు దురదృష్టకరం. మేం దీన్ని ఖండిస్తున్నాం. ట్రంప్‌ వ్యాఖ్యలకు ఈ ఘటనకు సంబంధమే లేదు’ అని శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ సీన్  స్పైసర్‌ వెల్లడించారు. అధ్యక్షుడి వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా లేవని దీన్ని తప్పుగా చూపిస్తున్నారన్నారు.
 
i, need, an answer, srinivas, kuchibhotla-s, wife, holds, press, conference,