పెచ్చరిల్లిపోతున్న ఐఎస్ఐఎస్: ఇద్దరు మహిళల గొంతుకోసిన మిలిటెంట్లు
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపుల అరాచకాలు రోజు రోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి. ఇన్నాళ్లు పిల్లలు, పెద్దలంటూ తారతమ్యం లేకుండా కార్యకలాపాలు కొనసాగించిన ఐఎస్ఐఎస్ ప్రస్తుతం మహిళల ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడట్లేదు. ఇప్పటివరకు స్త్రీల జోలికి వెళ్లని ఈ మిలిటెంట్ సంస్థ మరింత కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు అర్థమవుతోంది.
తాజాగా, సిరియాలో ఇద్దరు మహిళలను గొంతు కోసి చంపేసింది. ఐఎస్ మిలిటెంట్లు డీర్ ఎజ్జోర్ ప్రావిన్స్లో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలిపింది. క్షుద్రపూజల ఆరోపణలో ఐఎస్ వారిని హతమార్చించిందని మానవ హక్కుల సంస్థ సిరియా విభాగం పేర్కొంది.