నాసా అంతరిక్ష ప్రయోగానికి ఎంపికైన భారత సంతతి వ్యక్తి రాజాచారి
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) త్వరలో ఎర్త్ ఆర్బిట్ అండ్ డీప్ స్పేస్ మిషన్ల నిమిత్తం ఓ అంతరిక్ష ప్రయోగం చేపట్టనుంది. ఇందుకోసం నాసా ఎంపిక చేసిన వ్యోమగాముల్లో భారత సంతతికి చెందిన రాజాచారి(39)కి
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) త్వరలో ఎర్త్ ఆర్బిట్ అండ్ డీప్ స్పేస్ మిషన్ల నిమిత్తం ఓ అంతరిక్ష ప్రయోగం చేపట్టనుంది. ఇందుకోసం నాసా ఎంపిక చేసిన వ్యోమగాముల్లో భారత సంతతికి చెందిన రాజాచారి(39)కి అవకాశం లభించింది.
యూఎస్ ఎయిర్ ఫోర్స్లో లెఫ్టినెంట్ కల్నల్గా ఆయన పని చేస్తున్నారు. 461 ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్లో కమాండర్గాను, కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఎఫ్-35 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఫోర్స్కు డైరెక్టర్గాను ఆయన వ్యవహరిస్తున్నారు.
కాగా, నాసా నిర్వహించనున్న ఈ ప్రయోగానికిగాను గతంలో దరఖాస్తులను ఆహ్వానించగా, పద్దెనిమిది వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 12 మందిని నాసా ఎంపిక చేసింది. ఈ పన్నెండు మందిలో రాజాచారి ఒకరు.