శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 8 ఏప్రియల్ 2017 (10:14 IST)

వాషింగ్టన్‌: దోపిడి దొంగల చేతిలో హతమైన భారతీయుడు... ముఖానికి మాస్కులు ధరించి..?

అమెరికాలో భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. వాషింగ్టన్ రాష్ట్రంలోని మకియా నగరంలో భారతీయుడు మరణించాడు. అదీ దోపిడి దొంగల చేతిలో హతమైనాడు. వాషింగ్టన్ రాష్ట్రంలోని యకిమా నగరంలో ఈ ఘటన చోటుచేసుకొంది.

అమెరికాలో భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. వాషింగ్టన్ రాష్ట్రంలోని మకియా నగరంలో భారతీయుడు మరణించాడు. అదీ దోపిడి దొంగల చేతిలో హతమైనాడు. వాషింగ్టన్ రాష్ట్రంలోని యకిమా నగరంలో ఈ ఘటన చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌కు చెందిన విక్రమ్ జర్యాల్ నెలరోజుల క్రితమే అమెరికా వెళ్ళాడు. ప్రస్తుతం యకిమా సిటీలోని ఏఎం-పీఎం గ్యాస్ స్టేషన్‌లో క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
 
ముఖానికి మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు విక్రమ్ పనిచేస్తోన్న గ్యాస్ స్టేషన్‌కు వచ్చి డబ్బులు డిమాండ్ చేశారు. విక్రమ్ స్టేషన్ కౌంటర్‌లో ఉన్న నగదును వారికిచ్చాడు. అయినా ఆ ఇద్దరు దుండగుల్లో ఓకరు విక్రమ్ పై కాల్పులు జరిపారు. అనంతరం వారు పారిపోయారు. ఈ ఘటన జాత్యంహకార దాడే అయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
 
దుండగులు వెళ్ళిపోయిన తర్వాత కొందరు విక్రమ్‌ను గుర్తించి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనను కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఖండించారు.