1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 8 ఏప్రియల్ 2017 (16:08 IST)

మలాలాకు అరుదైన గౌరవం.. ఐరాస శాంతి దూతగా ఎంపిక..

నోబెల్ అవార్డు గ్రహీత మలాలా యూసఫ్ జాయ్‌కి అరుదైన గౌరవం దక్కింది. మలాలాను ఐక్యరాజ్య సమితి శాంతి దూతగా ఎంపిక చేశారు. ఐరాసలో మలాలాకు సమున్నత గౌరవం ఇచ్చేందుకు గాను ఆమెను శాంతి దూతగా ఎంపిక చేసినట్లు ఐరాస స

నోబెల్ అవార్డు గ్రహీత మలాలా యూసఫ్ జాయ్‌కి అరుదైన గౌరవం దక్కింది. మలాలాను ఐక్యరాజ్య సమితి శాంతి దూతగా ఎంపిక చేశారు. ఐరాసలో మలాలాకు సమున్నత గౌరవం ఇచ్చేందుకు గాను ఆమెను శాంతి దూతగా ఎంపిక చేసినట్లు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ తెలిపారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా బాలికా విద్యను ప్రోత్సహించడంపై మలాలా దృష్టి సారించారని.. అందుకే ప్రపంచ పౌరునికి ఐరాస సెక్రటరీ జనరల్ అందజేసే అత్యున్నత గౌరవాన్ని మలాలాకు అందజేసినట్లు ఐరాస అధికార ప్రతినిధి స్టెఫానీ డుజరిక్ పేర్కొన్నారు. సోమవారం జరిగే కార్యక్రమంలో మలాలాకు ఈ పదవిని అధికారికంగా కట్టబెట్టనున్నారు. 
 
వాయవ్య పాకిస్థాన్‌లో బాలబాలికలందరికీ విద్యా హక్కును అమలు చేయాలంటూ పోరాడుతున్న మలాలాపై గతంలో తాలిబన్ ఉగ్రవాదులు హత్యా యత్నం చేసినా.. అలాంటి భయానక పరిస్థితిలో కూడా ఆమె మహిళలు, బాలికలు, ప్రజల హక్కుల పట్ల నిబద్ధత కనబరచడంతో ఈ అరుదైన ఉన్నత గౌరవం ఆమెకు దక్కిందని తెలిపారు. తద్వారా అతి చిన్న వయస్సులో ఈ అవార్డును గెలుచుకున్న వ్యక్తిగా మలాలా రికార్డు సాధించింది.