బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2017 (16:10 IST)

ఆహారం ఇవ్వలేదు... ఎలుగుబంటికి చిర్రెత్తుకొచ్చింది.. ఏం చేసిందో వీడియోలో చూడండి..

థాయ్‌లాండ్‌లో ఆహారం ఇవ్వకుండా చుక్కలు చూపించిన ఓ యువకుడిని ఎలుగుబంటి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

థాయ్‌లాండ్‌లో ఆహారం ఇవ్వకుండా చుక్కలు చూపించిన ఓ యువకుడిని ఎలుగుబంటి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్‌, పెట్చబన్ ప్రావిన్స్‌లోని ఓ ఆలయంలో పెంచబడుతున్న ఎలుగుబంటికి ఆ ఆలయానికి వచ్చే వారు ఆహారం ఇస్తుంటారు. ఎలుగుబంటి కంటూ ఓ ప్రత్యేక భవనం ఉంది. అలా ఆ గుడికి వచ్చిన ఓ స్నేహితుల బృందం ఆ ఎలుగుబంటికి ఆహారం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆ బృందంలోని నైపుమ్ ప్రోమరేట్ అనే వ్యక్తి ఒక తాడు ద్వారా ఆహారాన్ని ఎలుగబంటికి ఇవ్వజూపాడు. 
 
అయితే ఎలుగుబంటికి ఆహారం ఇవ్వకుండా తాడును వదులుతూ.. ఎత్తుతూ ఏమార్చాడు. దీంతో ఎలుగుబంటికి చిర్రెత్తుకొచ్చింది. అంతే కాంపౌండ్ పైకెక్కి.. ఆ యువకుడిని తన గూడులోకి లాక్కుని తీవ్రంగా గాయపరిచింది. ఆ ఎలుగుబంటి నుంచి చిక్కుకున్న తన స్నేహితుడిని కాపాడేందుకు మిగిలిన వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. 
 
ఆపై ఆలయ అధికారులు ఎలుగుబంటి గూడులోకి ప్రవేశించి.. ఆ వ్యక్తిని కాపాడారు. అప్పటికే తీవ్రగాయాలపాలైన నైపుమ్‌ను ఆస్పత్రికి తరలించారు. నైపుమ్‌కు ప్రాణాపాయం లేదని అతనికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చూడండి.