శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 23 ఫిబ్రవరి 2019 (10:55 IST)

కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టిన మోడల్.. వామ్మో బాగానే పలికింది..

ఓ మోడల్ తన కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టింది. అంతే అమ్మడును వేలంలో ఎగరేసుకుని పోయేందుకు జనాలు ఎగబడ్డారు. వివరాల్లోకి వెళితే.. అజర్ బైజాన్‌కు చెందిన మొహబూబా మహ్మద్ జాదా అనే 23 ఏళ్ల యువతి తన కన్యత్వాన్నిఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టుకుంది. వరల్డ్ ఫేమస్ ఎస్కార్ట్ సైట్ సిండ్రెల్లాలో మోడల్ కన్యత్వంపై ప్రకటన వచ్చింది.
 
తాను స్వచ్ఛమైన కన్యనని...తనను పొందాలనుకునేవాళ్లు.. వేలం ప్రక్రియలో పాల్గొనాలంటూ ప్రకటన విడుదల చేసింది. మెహబూబా కూడా ఆర్థిక కష్టాలతో ఈ పని చేసింది. తన తల్లి ఇల్లు కూడా లేని దుర్భర పరిస్థితుల్లో ఉందని ఆమె తెలిపింది. తన తల్లి కోసం కనీసం 90వేల పౌండ్లు అయిన సేకరించాలని పేర్కొంది. 
 
మెహబూబా ప్రకటనకు అంతర్జాతీయ రసికుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో వేలం ప్రక్రియ మిలియన్ పౌండ్లు దాటిపోయింది. ఈ వేలంలో మెహబూబాను టోక్యోకు చెందిన ఓ రాజకీయ నాయకుడు దక్కించుకున్నాడు. 
 
ఇకపోతే.. మెహబూబాను దక్కించుకోవడానికి ఆ జపనీస్ పొలిటీషియన్ భారత కరెన్సీలో రూ.18.56 కోట్లు చెల్లించాడు. వేలంలో మెహబూబాను దక్కించుకోవడానికి పోటీపడిన వారిలో లండన్‌కు చెందిన ప్రముఖ లాయర్, మ్యూనిచ్ ఫుట్ బాల్ క్లబ్‌కు చెందిన ఆటగాడు కూడా ఉన్నారు.