1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 22 మార్చి 2018 (09:16 IST)

నడి రోడ్డుపైనే అశ్లీల దృశ్యాలా? వాహనాలు కదల్లేదు.. భారీ ట్రాఫిక్ జామ్

రోడ్లకు పక్కన పెద్ద పెద్ద బ్యానర్లు, పోస్టర్లు పెట్టి వాహనదారులను ఆకట్టుకునే ట్రిక్స్ అందరికీ తెలిసిందే. టూవీలర్లు, ఫోర్ వీలర్లు నడుపుతూ వెళ్లే వారికి భారీ బోర్డింగ్‌లు కంటపడతాయి. ఆ బోర్డింగ్‌ల్లో ఆకర

రోడ్లకు పక్కన పెద్ద పెద్ద బ్యానర్లు, పోస్టర్లు పెట్టి వాహనదారులను ఆకట్టుకునే ట్రిక్స్ అందరికీ తెలిసిందే. టూవీలర్లు, ఫోర్ వీలర్లు నడుపుతూ వెళ్లే వారికి భారీ బోర్డింగ్‌లు కంటపడతాయి. ఆ బోర్డింగ్‌ల్లో ఆకర్షణీయమైన ఫోటోలు వుండటం సాధారణం. అయితే రద్దీ రోడ్డుపై అశ్లీల దృశ్యాలు కనిపించేసరికి అవాక్కైన ప్రజలు రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఫిలిప్పీన్స్ ఆర్థిక రాజధాని మకాటి ప్రధాన రహదారి మధ్యలో వాహన చోదకులు, పాదచారులతో రద్దీగా ఉన్న ప్రాంతంలోని భారీ ఎలక్ట్రానిక్ బిల్ బోర్డుపై ప్రకటన స్థానంలో అశ్లీల దృశ్యాలు సుమారు 30 సెకన్ల పాటు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసిన స్థానికులు నివ్వెరపోయారు. కొందరు యువకులు వాటిని సెల్‌ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అవి వైరల్‌గా మారాయి. 
 
ఈ ప్రసారాల కారణంగా ఆ మార్గంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. దీనిపై ఫిర్యాదులందడంతో మకాటి మేయర్ అబిగేల్ బినయ్ దీనిని నిర్వహిస్తున్న గ్లోబల్ ట్రానిక్స్ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ బిల్ బోర్డును మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.