బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 10 మే 2018 (12:25 IST)

హిందూ వ్యాపారికి ఘోర అవమానం.. గుండు గీసి.. కనుబొమలు తొలగించి...

పొరుగుదేశం పాకిస్థాన్‌లో హిందువులపై అకృత్యాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ దేశంలో హిందువులు మైనార్టీలుగా జీవిస్తున్న విషయం తెల్సిందే. దీంతో వారిపై దాడులు ఎక్కువై పోతున్నాయి.

పొరుగుదేశం పాకిస్థాన్‌లో హిందువులపై అకృత్యాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ దేశంలో హిందువులు మైనార్టీలుగా జీవిస్తున్న విషయం తెల్సిందే. దీంతో వారిపై దాడులు ఎక్కువై పోతున్నాయి. కేవలం ఒక్క హిందువులపైనే కాకుండా, అల్పసంఖ్యాక వర్గాలుగా ఉన్న ప్రజలపై పాకిస్థాన్‌లో దాడులు జరుగుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా భారత్‌కు వెళ్లకుండా పాకిస్థాన్‌లో స్థిరపడిన ఓ కుటుంబానికి చెందిన చున్నీలాల్ అనే వ్యాపారికి తాజాగా తీరని అవమానం ఎదురైంది. ఈ అవమానం సింధ్ ప్రాంతంలో జరిగింది.
 
ఈ ప్రాంతానికి చెందిన చున్నీలాల్ అనే హిందువు వడ్డీ వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. తాజాగా ఆయన అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చాడని ఫిర్యాదులు రావడంతో స్థానిక పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని శిరోముండనం చేయడంతోపాటు, మీసాలు, కనుబొమలు తొలగించారు. 
 
ఈ విషయమై పాక్‌కు చెందిన మానవహక్కుల సంఘం కార్యకర్త కపిల్‌దేవ్ ట్వీట్ చేస్తూ శికార్‌పూర్ పోలీసులు వడ్డీకి డబ్బులిచ్చిన హిందూ వ్యాపారి చున్నీలాల్‌కు శిరోముండనం చేయడంతోపాటు అతని మీసాలు, కనుబొమలు తొలగించారని ఆవేదన చెందారు.
 
చున్నీలాల్ అల్పసంఖ్యాక వర్గానికి చెందిన వారు కావడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని పేర్కొన్నారు. కాగా పాక్‌లో హిందువుల జనాభా కేవలం 4 శాతం ఉన్న నేపధ్యంలో హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయని విచారం వ్యక్తంచేశారు.